ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు సమాఖ్య జేఏసీ డిమాండ్ చేసింది. పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధ బోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క సన్నిధిలో వనదేవతల సాక్షిగా ఈ మేరకు కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరం చేస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 2013లో హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలుపర్చాలని కోరారు.
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ మాట్లాడుతూ ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్లకు వేములవాడ రాజన్న అని భువనగిరికి యాదాద్రి అని గద్వేల్ కు జోగులాంబ ని కొత్తగూడెంకు భద్రాద్రి అని భూపాలపల్లి బొందల గడ్డకు జయశంకర్ సార్ పేరు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు కొమురయ్య మాట్లాడుతూ కెసిఆర్ తక్షణమే ములుగు జిల్లాకు సమ్మక్క పేరు పెట్టాలని కోరారు.
మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా కోఆర్డినేటర్ ఇరుగుపైడి మాదిగ మాట్లాడుతూ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మాట్లాడుతూ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని అన్నారు. ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ కరపత్రాన్ని ఆవిష్కరించడం సంతోషమని అన్నారు. ఎంఆర్పిఎస్ ములుగు జిల్లా కార్యదర్శి గజ్జల ప్రసాద్ మాట్లాడుతూ మా సొంత గ్రామమైన సమ్మక-సారక్క సన్నిధిలో ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం కోసం కరపత్రం ఆవిష్కరించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. సమ్మక్క సారక్క పూజారి సిద్ధ బోయిన స్వామి ఆదివాసుల మేడారం యూత్ అధ్యక్షులు సిద్ధమైన భోజనం ములుగు జిల్లా జేఏసీ నాయకులు ఓరుగంటి శ్రవణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.