ములుగు జిల్లా కేంద్రంలో ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ గంగిశెట్టి శ్రీనివాస్ సహకారంతో వినాయక చవితి సందర్భంగా ఈరోజు 150 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది.
పర్యావరణాన్ని పరిరక్షించడం లో భాగంగా గత ఆరు సంవత్సరాల నుండి ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సానికొమ్ము రవీందర్ రెడ్డి, కార్యదర్శి కొండి సాంబశివ ఉపాధ్యక్షులు చుంచు రమేష్, లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ గంగిశెట్టి శ్రీనివాస్, లయన్ సుంకర రవి,లయన్ సముద్రాల రఘు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.