వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి అంగడి ఆవరణలో ఈ నెల 12వ,తేది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు జరప తలపెట్టిన దళిత భేరి సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు శాసనాల అంజి నాయుడు కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సాయిబాబా థియేటర్ రోడ్డులో గల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుడు సుతారి శ్రీనివాస్ అధ్యక్షతన దళిత భేరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు శాసనాల అంజి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ వీరుల ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఉన్న ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుండి తొలగించి రాష్ట్ర దళితులను మోసం చేశారని అన్నారు.
ముఖ్యమంత్రి దళితులకు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక హామీ ఇస్తూ మోసం చేస్తున్నారని అన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి అనే పథకం ప్రవేశపెట్టి ఇప్పటికీ ఒక్క దళితుడికి కూడా ఒక్క సెంట్ భూమి కూడా ఇవ్వలేదని,ఇప్పుడు మరల దళితులకు దళిత భీమా పథకం అంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు దళితులపై ప్రేమను ఒలకబోస్తూ ఎన్నికలు అయిపోగానే దళితులకు మొండిచేయి చూపిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తెరాస ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు దళితులందరూ ఏకం కావాలని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ షర్మిల సారథ్యంలో ఏర్పాటు జరిగిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరుగుతున్న దళిత భేరి సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా దళిత సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నున్న రామారావు,తోట కోటి నాయుడు, అంజయ్య,జానయ్య,ఏసోబు, ఇస్సాకు, ముత్తయ్య, అహ్మద్,కొనపర్తి రాజేష్,శివారెడ్డి,నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్