ములుగు మండల టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జనవరి 3వ తేదీన ఏర్పాటు చేసినట్లు ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ తెలిపారు.
ఈ సమావేశంలో మండలంలోని గులాబీ శ్రేణులు అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గులాబీ జెండాను ఎత్తిన నాడు వెంట నడిచిన ఉద్యమకారుల నుండి రెండవ సారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈరోజు వరకు పార్టీకి వెన్నంటి ఉన్న గులాబీ కుటుంబ సభ్యులు సమావేశంలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు నియోజకవర్గ ఇంచార్జి ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హాజరు కానున్నారు. మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు, మండల కమిటీ అధ్యక్షులు,పార్టీ సీనియర్ నాయకులు, యువజన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,పట్టణ అధ్యక్షులు, నాయకులు మహిళా సోదరుమణులు, రైతు బంధు మండల అధ్యక్షులు,కార్యదర్శులు,ప్రజాప్రతినిధులు,
జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పి.ఏ.సీస్ చైర్మెన్ల్, డైరెక్టర్లు,వార్డ్ మెంబర్ల,పార్టీ అనుబంధ సంఘాలు,పార్టీ అభిమానులు,కార్యకర్తలు అందరు బాధ్యతగా తరలిరావాలి అని కోరారు.