29.7 C
Hyderabad
April 29, 2024 07: 27 AM
Slider కరీంనగర్

కరోనా పీడితుల సేవలో మై వేములవాడ వాట్సాప్ గ్రూప్

#my Vemulawada

ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితుల బాగోగులు తెలుసుకుని మధ్యాహ్నం భోజనం పాకెట్లను అందించే కార్యక్రమాన్ని మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ కొనసాగిస్తున్నది.

తొమ్మిదవ  రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్లో కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సభ్యులు ఈరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, డ్రై ఫ్ఫ్రూట్స్ అందించారు.

రాత్రికి  భోజనం కూడా అందించనున్నట్లు గ్రూపు సభ్యులు తెలిపారు.

అంతేకాకుండా లాక్డౌన్ పూర్తి అయ్యే వరకూ ప్రతీరోజు ఇదే విధంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, మధు మహేష్,  నాగుల చంద్రశేఖర్ డాక్టర్ బెజ్జంకి రవీందర్,  నూగూరి మహేష్, పారువెళ్ళ శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్ , గొంగళ్ళ రవికుమార్, రాజేందర్ పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Satyam NEWS

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

Satyam NEWS

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment