33.7 C
Hyderabad
April 28, 2024 23: 31 PM
Slider కృష్ణ

చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు

#narabrahmini

చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘కాంతితో క్రాంతి’ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?. అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం’’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు.

Related posts

“ఐశ్వర్యకు తోడుగా అభిరామ్”తో యష్ రాజ్ అరంగేట్రం

Satyam NEWS

స్వర్ణకవచ్చాలంకృత అలంకరణలో దుర్గామాత

Satyam NEWS

ఏపి భవన్ లో ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డు తొలగింపు

Satyam NEWS

Leave a Comment