దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయ ఆవరణలో గురువారం అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి.
అమ్మవారి విగ్రహా దాత సాక్షి దినపత్రిక వెంకటాపూర్ మండలం రిపోర్టర్ రామిడి కృష్ణారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. మొదటిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా భక్తులకు దర్శనం ఇచ్చారు.
విగ్రహ ప్రతిష్ట అనంతరం కృష్ణ రెడ్డి చే అన్నదాన కార్యక్రమం చేయటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి,బాసాని రాయపురెడ్డి, సాంబిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, నగరపు రమేష్, కొమ్మిరెడ్డి నర్సింహా రెడ్డి, మందల విజయ్ కుమార్ రెడ్డి, అన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి, కొత్త సురేందర్,ఇమ్మడి రాకేష్ యాదవ్, దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి,నరేష్, ఆవుల ప్రశాంత్ రెడ్డి,ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, మహేందర్, భక్తులు పాల్గొన్నారు.