రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానం ఉన్న నాంపల్లి గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు నృసింహ జయంతి సందర్భంగా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన ,వేదవిన్నపాలు,తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు రమణాచారి,విజయ సింహ చారి తో పాటుగా పర్యవేక్షకులు అల్లి శంకర్ ,ఇంచార్జ్ నుగురి నరేదర్ పాల్గొన్నారు.
(నృసింహ దివ్వ కళ్యాణం సంక్షిప్త వీడియో)