యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలం సురేష్ అనుచరులు చంద్రబాబు నాయుడు పై రాళ్లదాడికి పాల్పడడటాన్ని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పై రాళ్ళ దాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలకు పరాకాష్ట గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనల జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ లో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఆంధ్రప్రదేశ్ లో రక్షణ ఎక్కడ ఉంటుంది అని అన్నారు. మంత్రి ఆదిమూలం సురేష్ ఇలాంటి దాడులకు తెగబడ్డారు అంటే వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉండవచ్చు అన్నారు.ఈ ఘటన గురించి కేంద్రం దర్యాప్తు కోసం నవతరంపార్టీ డిమాండ్ చేస్తోందని రావుసుబ్రహ్మణ్యం అన్నారు.
previous post