శ్రీ రామజన్మభూమి ట్రస్టు ప్రధాన పూజారి నృత్య గోపాల్ దాస్కు కరోనా పాజిటీవ్ వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన మధుర వెళ్లారు.
అక్కడ శ్వాసకోస ఇబ్బందులు రావడంతో డాక్టర్లు కరోనా పరీక్ష నిర్వహించారు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటీవ్ వచ్చింది.
మహంతి నృత్యగోపాల్ దాస్కు మెరుగైన చికిత్స అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధుర జిల్లా వైద్యాధికారితో మాట్లాడారు.