వాయిద్య కళాకారుల సంక్షేమం కోసం వైయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ములుగు మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద శుక్రవారం వాయిద్య కళాకారుల సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోగా ఈ సమావేశానికి ములుగు జిల్లా అధ్యక్షులు అంకుస్, సీనియర్ నాయకులు పైడి బాబు అఫ్జ్ల్ ల్ పాల్గొని కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వాయిద్య కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అన్నారు. డబల్ బెడ్ రూమ్ కేటాయించాలని కోరారు. వాయిద్య కళాకారులకు ప్రత్యేక ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలను ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడారి సాంబయ్య, ఉపాధ్యక్షులు తాళ్ల లక్ష్మీనరసయ్య, మహమ్మద్ జానీ, కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా సహాయ కార్యదర్శి సంగు ఓదేలు, కోశాధికారి రాచర్ల చంద్రమౌళి, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్, జెర్రిపోతుల పైడి బాబు, మహమ్మద్ సర్వర్, గౌరవ సలహాదారులు మహమ్మద్ మహేష్, డి ఐలయ్య కార్యవర్గ సభ్యులుగా టి కుమార్, డి మహేందర్, జె సమ్మయ్య, వై తిరుపతి, గొంది సాంబయ్య, ఎస్.కె మైన్ పాషా, చాంద్ పాషా లను ఎకగ్రివంగా ఎన్నుకున్నారు.
previous post
next post