ఏలూరు సాయి స్వర్ణ హీరో హొండా మోటార్ బైక్ షోరూమ్ లో ప్రత్యేకంగా యువత కోసం ప్రవేశపెట్టిన జూమ్ అనే మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఏలూరు ఇన్చార్జ్ డి.ఎస్.పి పైడేశ్వర రావు మంగళవారం రాత్రి షోరూం యాజమాన్యం ఆద్వర్యం లో వినియోగదారుల సందడి మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. బైక్ లాంచింగ్ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు జూమ్ ద్విచక్ర వాహనాన డిజైన్ యువతను ఆకర్షించింది.జూమ్ బైక్ ఫ్యూచర్స్ పట్ల ఆసక్తి కలిగిన పలువురు యువకులకు డి ఎస్ పి పై డేశ్వరరావు సి ఐ లు ఆది ప్రసాద్ .వరప్రసాద్ జూమ్ బైక్ తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి స్వర్ణ హీరో షోరూమ్ మేనేజర్ సోమేశ్వరరావు, మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
previous post