39.2 C
Hyderabad
April 28, 2024 12: 40 PM
Slider కడప

రాజంపేటలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి

#ntr

కడప జిల్లా రాజంపేటలో తెలుగు దేశం వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 26 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎన్.టి. రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూల మాలవేసి ఘన నివాళులర్పించారు.

రాజంపేట నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్ టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని నిర్వహించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ వినాదాలు చేశారు.ఎన్.టి.రామారావు విగ్రహానికి సమీపంలో ఉన్న యన్. కె.యన్. కళ్యాణ మండపంలో లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ రక్తదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్టీయార్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ రాజకీయ,సినీ రంగంలో చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, సంజీవరాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, బషీర్,శివా,మందా,శ్రీను,అనసూయమ్మ,అద్దెపల్లె ప్రతాప్ రాజు,పాండు రాజు,రమేష్ గుప్తా, సత్య నరసింహా గుప్తా, రాంనగర్ నరసింహా,సమ్మెట శివా,ఇడీమడకల కుమార్,మేకా నరసింహా,డి.ఆర్. యల్ .మణి, గుగ్గిళ్ల చంద్ర మౌళి తదితర టీడీపీ నాయకులు,కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS

మత్య్సకారుల శ్రమను దోచుకుంటున్న మధ్య దళారులు

Satyam NEWS

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

Satyam NEWS

Leave a Comment