నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలు చేసి అక్కడ జరిగిన సభల్లో పాల్గొన్న వారు చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారని అధికారులు ప్రకటించడంతో నేటి ఉదయం హైదరాబాద్ పాత బస్తీలో పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. నిన్నమొన్నటి వరకూ చిన్న పిల్లల్ని, యువకుల్ని బయటకు తిరిగేందుకు పంపిన పెద్దలు నేడు వారిని ఇంట్లోనే కట్టడి చేసినట్లు కనిపించింది.
చార్మినార్ మక్కా మసీదు ప్రాంతాలలో చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా నరసంచారం లేకుండా పోయింది. నిన్నటి వరకూ తెరిచి ఉంచిన చిన్న దుకాణాలను కూడా నేడు మూసివేశారు. పూర్తిగా పాత బస్తీ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది.