గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ లో ఒక వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు.
గుంటూరు సంగడిగుంట కు చెందిన 11 మంది యువకులు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాలపై సముద్రం బీచ్ కు చేరుకున్నారు.
వీరంతా బీచ్ లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి సంతోష్, తరుణ్ గల్లంతు అయ్యారు. తీరంలో ఉన్న జాలర్లు సంతోష్ ను కాపాడి వైద్యశాలకు తరలించారు.
సముద్రం లో గల్లంతైన తరుణ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.
రూరల్ ఎస్సై కిరణ్ గల్లంతైన యువకుడి వివరాలను సేకరిస్తున్నారు.