జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పండుగ రోజే ఒక ఇంట్లో విషాదం నెలకొంది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారి పై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు.
ఈ కిరాతక దాడిలో వంగల దినేష్ (25) అనే వ్యక్తి మరణించాడు. అతనిని కాపాడడానికి ప్రయత్నించిన అతని బాబాయి వంగల మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన వంగల మహేష్ ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.