విజయవాడ లోని కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్ధుడు అదృశ్యం అయ్యాడు. వారం రోజులు అయినా ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మా ఆయనకు గత నెల 24వ తేదీన ఆస్పత్రి కి వెళ్లగా బాగా ఆయాసం వచ్చింది…
ప్రైవేట్ ఆస్పత్రి కి వెళితే… కొత్త ప్రభుత్వాసుత్రికి వెళ్లమని చెప్పారు. ఒపి రాయించాక… తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.. చివరికి అందరినీ అడిగాక.. వీల్ చైర్ మీద లోపలకు పంపారు. పల్స్ పడిపోతున్నాయి.. ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు.. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ఉండి వెళ్లాను..
మర్నాడు అంటే 25వ తేదీన వెళితే వసంతరావు అనే వ్యక్తి లేడని చెప్పారు.. నాలుగు రోజులు అయినా ఆచూకీ దొరకలేదు… అధికారులు వెతికిస్తామని చెబుతూనే ఉన్నారు.. అని వసంతరావు భార్య ధనలక్ష్మి తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పోలీసులు ఇంటికి వచ్చి అన్ని వివరాలు రాసుకెళ్లారు. వారం అయినా ఆచూకీ దొరకలేదు… అధికారులు వెతుకుతున్నామని చెబుతూనే ఉన్నారు అని ఆమె అన్నారు.