తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అనుబంధ సంస్థ అయిన తెలుగు యువత రాష్ట్ర స్థాయి పూర్తి కమిటీని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర TDP అధ్యక్షుడు L. రమణ ఆమోదంతో ప్రకటించారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా పొగాకు జైరాం చందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి గార్లపాటి శ్రీనివాస్ (మంజునాధ) ను రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గార్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు రమణకి, నల్గొండ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్ కి, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి చావా కిరణ్మయికి ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.
పార్టీ కి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.