చెన్నై లోని టీవీఎస్ కంపెనీ కి చెందిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి కోవిడ్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ వితరణగా ఇచ్చారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నది.
వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేశారు. వెంకటగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లోని కోవిడ్ సెంటర్ కు అదేవిధంగా పాల కేంద్రం వద్ద ఉన్న శ్రీ చక్ర హాస్పిటల్ కోవిడ్ సెంటర్ లలో వీటిని ఏర్పాటు చేశారు.
మూడు లక్షల రూపాయల విలువచేసే 5 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి క్లస్టర్ ఇన్చార్జి నందగోపాల్ ద్వారా కోవిడ్ సెంటర్ల ఇన్చార్జి డాక్టర్లకు అందజేశారు. వెంకటగిరి సామాన్యుడు