ఎవరిపైకి వదిలిన బాణమో తెలియదు కానీ సూటిగా గుచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుడిగా చాలా కాలం పాటు పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి వి రమేష్ చేసిన ట్విట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
మునిసిపల్ ఎన్నికలు హాట్ హాట్ గా జరుగుతున్న ఈ తరుణంలో పి వి రమేష్ చేసిన ట్విట్ ఎవరి కొంప ముంచుతుందో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇంతకీ ఆయన పెట్టిన ట్విట్ ఏమిటంటే ‘‘ నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడు నేరస్తుడే’’ అని.
ఆంధ్రప్రదేశ్ లో నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతున్నదనా అర్దం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పౌరహక్కుల నేత వరవరరావు చెప్పిన మాటే అయినా దీన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర పని చేసి అర్ధంతరంగా బయటకు వచ్చిన పి వి రమేష్ పెట్టడంతో పలు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.