ధర్మవరంలో… సొంత నిధులతో డిజిటల్ లైబ్రరీ
ఏ వ్యక్తి అయినా ఉన్నత స్థానం చేరుకోవడానికి పుస్తకాలు సోపానమని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు.తాను విజయనగరం జిల్లాలోని ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు..పల్నాడు జిల్లా కలెక్టర్ శివకుమార్. పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని, తద్వారా జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చని ఈ సందర్బంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ సూచించారు.
అత్యధిక సమయం గ్రంథాలయంలో గడిపిన వ్యక్తులంతా, అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని ఉదహరించారు. తనకు చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యంపై ఉన్న అభిమానం, ఐఎఎస్ సాధనకు దోహదపడిందన్నారు. తనకు ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివిన నీతి కథలు, మహనీయుల జీవిత గాథలను చూసి స్ఫూర్తి పొందవచ్చని చెప్పారు.
లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అన్నారు. ధర్మవరం పాఠశాల పదోతరగతి విద్యార్థులకు, దసరా సెలవుల తరువాత ఒక పోటీ పరీక్ష నిర్వహించి, అత్యుత్తమ మార్కులు సాధించిన మొదటి 20 మందిని, ఐదు రోజుల ఢిల్లీ యాత్రకు పంపిస్తానని శివశంకర్ ప్రకటించారు.ఈ సందర్బంగా ప్రముఖ కవి, ఆ పాఠశాల ఉపాధ్యాయుడు జిఎస్ చలం రూపొందించిన పుస్తకాలం సంకలనాన్ని సభలో ఆవిష్కరించారు.
చలం, ఈ పుస్తకాన్ని శివశంకర్కు అంకితమిచ్చారు. గ్రామానికి చెందిన ఉప్పాడ పౌండేషన్ ప్రతినిధులు, గ్రామ శ్మశాన వాటిక అభివృద్దికి రూ.50వేల విరాళాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారికి ఈ సందర్భంగా అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన పిరమిడ్ ప్రదర్శన, కోలాటం ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వర్రావు, విశ్రాంత ఉపాధ్యాయులు బాబూరావు మాష్టారు ప్రసంగించారు.
కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, తాశీల్దార్ డి.శ్రీనివాసరావు, ఎంపిడిఓ శేషుబాబు, ఎంఇఓ సత్యనారాయణ, హెచ్ఎం బి.లక్ష్మి, శివశంకర్ మాతృమూర్తి కృష్ణమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, బహుద సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.