వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు వైద్యసిబ్బంది దుర్భర పరిస్థితులను అర్థం చేసుకుని నిలిపివేసిన అలవెన్స్ లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బట్టు విజయవర్ధన్ బాబు కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకై వచ్చిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ భద్రతకై ఉద్యమిస్తున్న పారా మెడికల్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.
అంతే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు లాము విద్యా సాగర్ లు కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరారని విజయ్ వర్ధన్ చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయమై నిర్ణయం తీసుకోవాలి కోరుతూ వినతి పత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు. గతంలో కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వ అలవెన్స్ లు అందజేసిందని ఆయన తెలిపారు.
అనంతరం పారా మెడికల్ కాంట్రాక్టు వైద్య సిబ్బందిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారొకరు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్టు విజయ్ వర్ధన్ గుర్తుచేశారు. ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగులు కోర్ట్ ను ఆశ్రయించి ఉద్యోగాలు పొందారని చెప్పారు.
కోర్ట్ ద్వారా ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు వైద్యసిబ్బంది కి టి ఏ .డి ఏ, హెచ్ ఆర్ ఏ వంటి అలవెన్స్ లు ఇవ్వకుండా నిలిపివేసి జీ ఓ నంబర్ 27 తెచ్చి అమెండ్ మెంట్ చేశారని చెప్పారు. మరో అమెండ్ మెంట్ పారా మెడికల్ కాంట్రాక్టు సిబ్బందిని ఆదుకోవాలని విజయ్ వర్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోర్ట్ ను ఆశ్రయించి ఉద్యోగాలు పొందారని మనసులో పెట్టుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారొకరు కొంత మంది ఉద్యోగులకు వందల మైళ్ళ దూరం లో పోస్టింగ్ లు ఇచ్చి కక్ష పూరితంగా వ్యవహరించారని విజయ్ వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ కారణంగా మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెగ్యులర్ ఉద్యోగ సంఘ నాయకులు జీఎస్ఎన్ రాజు, నల్ల అప్పారావు జిల్లా అధ్యక్షుడు ఐఎన్టియుసి 3194, పి అపరంజమ్మ, గోవిందరాజు సంపూర్ణ మద్దతు ఇవ్వగా రాష్ట్ర, జిల్లా కన్వీనర్ దారం సభాపతి చంద్రశేఖర్ బట్టు, కాపా నాగరాజు, ఆర్ సింగరాజు మరడాని కిరణ్, నున్న గురునాథం, వేండ్ర శ్రీనివాసరావు ఒగ్గు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సూర్య నారాయణను బట్టు విజయ్ వర్ధన్ బాబు, దారం సభాపతి చంద్రశేఖర్, నల్ల అప్పారావు, నాగరాజు, కిరణ్, గురునాధం తదితరులు దుశ్సాలువ కప్పి చిరు సన్మానం చేశారు.