సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో ఈనెల 19 లభ్యమైన శవంకు సంబందించిన కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబoదించిన వివరాలు హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై సైదులు వెల్లడించారు. మృతుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన క్షత్రియ సాయినాథ్(26) అని, 18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ టెంపుల్ వద్ద మద్యం తాపించి నిందితులు ఉరివేసి హత్య చేశరన్నారు. మద్యానికి బానిసైన సాయినాథ్ వేధింపులు భరించలేక తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణి బాయ్ రూ.8లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు సహా 7మంది నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో మరో నిందితుడు వున్నాడని, హత్యకు వినియోగించిన 4 కార్లు, బైక్, ప్లాస్టిక్ తాడు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించారు.
previous post
next post