33.7 C
Hyderabad
April 29, 2024 02: 45 AM
Slider ముఖ్యంశాలు

కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులు

#murder

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో ఈనెల 19 లభ్యమైన శవంకు సంబందించిన కేసును పోలీసులు ఛేదించారు.  కేసుకు సంబoదించిన వివరాలు హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై సైదులు వెల్లడించారు. మృతుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన క్షత్రియ సాయినాథ్(26) అని,  18న మిర్యాలగూడ మండలం కల్లేపల్లి మైసమ్మ టెంపుల్ వద్ద మద్యం తాపించి నిందితులు  ఉరివేసి హత్య చేశరన్నారు. మద్యానికి బానిసైన  సాయినాథ్ వేధింపులు భరించలేక తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణి బాయ్ రూ.8లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించారు.  తల్లిదండ్రులు సహా 7మంది నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో మరో నిందితుడు వున్నాడని, హత్యకు వినియోగించిన 4 కార్లు, బైక్, ప్లాస్టిక్ తాడు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరచి  రిమాండ్ కు తరలించారు.

Related posts

పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం

Bhavani

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి

Satyam NEWS

ఎగొనీ: ఎంపిక అయిన కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వరా?

Satyam NEWS

Leave a Comment