కరోనా కష్ట కాలంలో కూడా దేశ భద్రతపై ఏ మాత్రం రాజీలేని పోరాటం చేస్తున్న సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
కొద్ది సేపటి కిందట ప్రారంభం అయిన పార్లమెంటు సమావేశాలలో ప్రధాని మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రజా సమస్యలపై చర్చించేందుకు హాజరైన పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు.
‘కరోనా ఉంది… మనకు బాధ్యత కూడా ఉంది’ అని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు అందరూ కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని మోడీ కోరారు.
మీడియా ప్రతినిధులు కూడా కరోనా నిబంధనలు పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇటీవల దివంగతుడైన భారత మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి లోక్ సభ నివాళి అర్పిస్తున్నది.