ఘాటైన విమర్శలు చేస్తూ తన దైన శైలిలో ప్రజా సమస్యలు లేవనెత్తుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరో అంశం లేవనెత్తారు. అన్ని పథకాలకు వైఎస్ ఆర్ పేరు పెట్టుకుంటున్న ప్రభుత్వానికి సెటైర్ వేస్తూ ‘‘జగనన్న ఉల్లిపాయల పథకం’’ పెట్టాలని ట్వీట్ చేశారు.
జగనన్న ఉల్లిపాయ పథకం పెట్టి డోర్ డెలివరీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. గ్రామ వాలంటీర్లతో ఇంటింటికీ కేజి ఉల్లిపాయలు రూ.25 కొప్పున పంపిణీ చేయాలని ఆయన సలహా ఇచ్చారు.ఆ పథకానికి జగన్ పేరు పెట్టుకోవచ్చన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున రైతు బజార్లలో నిలబడి అవస్థలు పడుతున్నా కారణంగా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోనే దిశగా ఆలోచించాలన్నారు.