ములుగు మండలం లోని మల్లంపల్లి లో విద్యుత్ శాఖలో హెల్పర్ గా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో మృతి చెందిన నల్లాల కృష్ణయ్య కుటుంబాన్ని మల్లంపల్లి గ్రామస్తులు పరామర్శించి ,లక్ష ఇరవై వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన విద్యుత్ శాఖ లో చేసిన సేవలను గుర్తు చేసుకొని ,ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి,మాజీ సర్పంచ్ గోల్కొండ రవి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, ల్యాద శ్యాం రావ్,రవి బాబు, చిట్టి రెడ్డి రామిరెడ్డి, వనమా వేణు,ఎడ్ల అనిల్ రెడ్డి, గూడెపు రాజిరెడ్డి,బక్కి నాగరాజు, తదితరులు ఉన్నారు.
previous post