39.2 C
Hyderabad
April 28, 2024 14: 32 PM
Slider నల్గొండ

అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలి

#CCRoad

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం అమరవరం గ్రామంలో నేడు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పనులను సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి ప్రారంభించారు.

రామాలయం ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి  సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.

అమరవరం గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ZPTC కొప్పుల సైదిరెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ శంభిరెడ్డి,కామిశెట్టి వెంకటేశ్వర్లు,వరలక్ష్మి బాల సైదులు, శ్రీనివాస్,నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే మట్టికొట్టుకు పోతారు

Satyam NEWS

కోదండ రామాల‌యం పునః నిర్మాణానికి మంత్రి అల్లోల‌ భూమి పూజ

Satyam NEWS

గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలి

Bhavani

Leave a Comment