2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి హరీశ్ రావు తెలిపారు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది. ఖర్చులు బాగా పెరిగాయి. ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్రం వెచ్చిస్తోంది. ఈ పరిస్థితులలో ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధిని 3 శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలి అని ఆయన కోరారు.
నేడు ఆయన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఐజీఎస్టీ నిధులు గత ఏడాది 2638 కోట్లు వచ్చాయని, ఈ ఏడాది ఐజీఎస్టీ విధులు13 వేల కోట్లు కన్సాలిటేడెటి ఫండ్ కు ఆదాయం సమకూరిందని, అందులో రాష్ట్రానికి రావాల్సిన 218 కోట్లు వెంటనే విడుదల చేయాలిని ఆయన కోరారు.
దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ తెలిపారు. ఆర్థిక స్థితి గతులు బాగా లేని ఈ పరిస్థితిల్లో, పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సవంత్సరం అయినందు వల్ల, రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.