వ్యాయామం చేయడం వల్ల ప్రతి ఒక్కరు దృఢత్వం ఉంటారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం బాగ్ అంబర్ పేట డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోని బ్యాడ్మింటన్ కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కోర్టుకు ఫెన్సింగ్ వేయించాలని, మట్టి సరైన లెవెలింగ్ లేక ఇబ్బంది పడుతున్నామని, క్రీడాకారులు, వృద్ధులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలని, తాగు నీటి వసతి కూడా కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుని బ్యాడ్మింటన్ కోర్టు అభివృద్ధికి కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు.
సత్యం న్యూస్, అంబర్పేట