తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో 28 వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువన్ కుమార్ రెడ్డి తన సోదరుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆకుతోట వీధి, పంట వీది కొత్తవీధి, మిట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా ప్రజాసేవకు అంకితమైన మా కుటుంబాన్ని ఆదరించాలని, డివిజన్ లో ఏ సమస్య ఉన్నా నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. డివిజన్ ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ 28 వ డివిజన్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, నటరాజ్ పాండురంగ, కిషోర్ యతీంద్ర, రెడ్డప్ప, మురళి, సుబ్బరాజు, నరసింహులు, గుప్తా, శ్యామ్, రమేష్, హేమరాజ్, మనోజ్, మహేష్ లతో పాటు ఆ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు.