29.7 C
Hyderabad
April 29, 2024 07: 15 AM
Slider చిత్తూరు

ఓట్ ప్లీజ్: ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తాం ఆశీర్వదించండి

TPT Elections

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో 28 వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువన్ కుమార్ రెడ్డి తన సోదరుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆకుతోట వీధి, పంట వీది కొత్తవీధి, మిట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా ప్రజాసేవకు అంకితమైన మా కుటుంబాన్ని ఆదరించాలని, డివిజన్ లో ఏ సమస్య ఉన్నా నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. డివిజన్ ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ 28 వ డివిజన్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, నటరాజ్ పాండురంగ, కిషోర్ యతీంద్ర, రెడ్డప్ప, మురళి, సుబ్బరాజు, నరసింహులు, గుప్తా, శ్యామ్, రమేష్, హేమరాజ్, మనోజ్, మహేష్ లతో పాటు ఆ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

Related posts

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Bhavani

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS

మహార్ కులస్తులకు తహసీల్దార్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ లను జారీ చేయాలి

Satyam NEWS

Leave a Comment