మీరు చదివింది.. నిజమే.. విద్యలనగరం లో విద్యార్థులు.. కత్తలు పట్టుకుని దోపిడీ కి దిగారు. పోలీసులు విచారిస్తే… గుట్టు రట్టయింది. విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఏడు రోజుల క్రితం రాత్రి 1.30 గంటల సమయంలో కొత్తపేటకు చెందిన రెడ్డి సన్యాసిరావును ముగ్గురు నిందితులు కత్తులతో బెదిరించి, అతని వద్ద నుండి సెల్ ఫోను లాక్కెళ్ళినట్లుగా వన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితుడు అయిన విజయనగరం మంగళవీధికి చెందిన షేక్ హుస్సేన్ మరియు మరో ఇద్దరు జువినల్స్ స్కూటీ పై స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద అనుమానాస్పదం గా తిరుగుతుండగా అక్కడ వాహన తనిఖీలు చేపడుతున్న వన్ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, విచారణ చేసారు. దీంతో నిందితులు పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. నిందితుడు వద్ద నుండి ఒక సెల్ ఫోను, రెండు కత్తులు, సుత్తి ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండుకు తరలించినట్లు గా వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు తెలిపారు. ఎస్ఐ వి.అశోక్ కుమార్, హెచ్. సీ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు దర్యాప్తులో సహకరించారు.
previous post
next post