37.2 C
Hyderabad
April 26, 2024 20: 57 PM
Slider విజయనగరం

విద్యలనగరం లో కత్తులు పట్టుకున్న విద్యార్థులు..

#police

మీరు చదివింది.. నిజమే.. విద్యలనగరం లో విద్యార్థులు.. కత్తలు పట్టుకుని దోపిడీ కి దిగారు. పోలీసులు విచారిస్తే… గుట్టు రట్టయింది. విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఏడు రోజుల క్రితం  రాత్రి 1.30 గంటల సమయంలో కొత్తపేటకు చెందిన రెడ్డి సన్యాసిరావును ముగ్గురు నిందితులు కత్తులతో బెదిరించి, అతని వద్ద నుండి సెల్ ఫోను లాక్కెళ్ళినట్లుగా వన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితుడు అయిన విజయనగరం మంగళవీధికి చెందిన షేక్ హుస్సేన్ మరియు మరో ఇద్దరు జువినల్స్ స్కూటీ పై  స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద అనుమానాస్పదం గా తిరుగుతుండగా అక్కడ వాహన తనిఖీలు చేపడుతున్న  వన్ టౌన్  పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, విచారణ చేసారు. దీంతో నిందితులు  పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. నిందితుడు వద్ద నుండి ఒక సెల్ ఫోను, రెండు కత్తులు, సుత్తి ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండుకు తరలించినట్లు గా వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు తెలిపారు. ఎస్ఐ వి.అశోక్ కుమార్, హెచ్. సీ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు దర్యాప్తులో సహకరించారు.

Related posts

నర్సీపట్నం బైక్ ర్యాలీలో అపశృతి:వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

Satyam NEWS

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా త్వరలో పాదయాత్ర

Satyam NEWS

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS

Leave a Comment