హీరోయిన్ శ్రేయా ను రియాల్టీ షో జడ్జి గా తెస్తానని నమ్మించి మోసం చేశాడో ప్రముఖ దినపత్రిక విలేకరి. శ్రేయా ను జడ్జిగా తీసుకువస్తానని చెప్పి తన వద్ద నుంచి ఆ రిపోర్టర్ రూ.5 లక్షలు వసూలు చేశాడని షో దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఐదు రోజుల కిందట జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాక్షి పత్రిక విలేకరి చైతన్య. అతనితో పాటు లక్ష్మి సింధుజ అనే మహిళ కూడా ఈ మోసంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై 420,406 సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
previous post