ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న కరోనా వైరస్ ను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయం అందించేందుకు పలు సంఘాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విస్తృతిని నిలుపుదల చేసేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ ఫోల్ర్టీ బ్రీడర్స్ అసోసియేషన్ తరపున కోటి రూపాయలు, తెలంగాణ ఫోల్ర్టీ ఫెడరేషన్ తరపున మరో కోటి రూపాయలు మొత్తం రెండు కోట్ల రూపాయలను ఆయన నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేశారు.