మే 3వ తేదీతో ముగుస్తున్న రెండో దశ లాక్ డౌన్ ఉంచాలా ఎత్తేయాలా అనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని చర్చిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
లాక్ డౌన్ పొడిగింపు వైపే సిఎంల మొగ్గు?
తర్వాత ఏం చేయాలి అనేది ప్రధాన ప్రశ్న కావడంతో చాలా మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నారు. మే 3 తర్వాత దేశం అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంల అభిప్రాయాలను, సూచనలను ప్రధాని సేకరిస్తున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు, ఇప్పటికే మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.