ఈ కష్టం ఎవ్వరికి రాకూడదు. ఒక వైపు జోరున వాన…. మరో వైపు కొట్టుకు పోయిన రోడ్లు….. ఇవి చాలవన్నట్లు ఊడిపడ్డ అనారోగ్యం. గిరిజన గ్రామాల్లోని ప్రజల బాధలు చెప్పేందుకు కూడా వీలులేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో ఒక ఆడపడుచుకు కష్టం వచ్చింది. సాటి మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది కానీ లేకుంటే…. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఆమె కష్టం రెట్టింపు అయ్యి ఉండేది.
పంటినొప్పితో విలవిలలాడుతున్న రేణుక అనే మహిళను మంచంపైనే ఉంచి వాగు దాటించారు ఆ గ్రామ యువకులు. అశ్వారావుపేట ఆసుపత్రికి తీసుకువచ్చి సకాలంలో చికిత్స చేయించారు. దాంతో ఆమె ప్రాణాలు దక్కాయి. లేకుంటే?