ప్రాపర్టి ట్యాక్స్ విధింపు పై పునపరిశీలన పిటీషన్లు, లీగల్, కోర్టు కేసులు, ఇతర ట్యాక్స్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు అన్ని సర్కిల్ కార్యాలయాలలో ప్రతి ఆదివారం ప్రాపర్టి ట్యాక్స్ గ్రీవెన్స్లను నిర్వహించనున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 16 నుండి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సర్కిల్ కార్యాలయాలలో ఈ గ్రీవెన్స్లు నడుస్తాయని తెలిపారు. ఈ నెల 16, 23, మార్చి 1, మార్చి 8, మార్చి 15, మార్చి 22, మార్చి 29 తేదీలలో ప్రాపర్టి ట్యాక్స్ గ్రీవెన్స్లు ఉంటాయని తెలిపారు.
ప్రాపర్టి ట్యాక్స్ విషయంలో ఇబ్బందులు, కేసులు ఉన్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.