రథసప్తమి వేడుకలు సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు అరసవల్లి చేరుకున్నారు.
స్వామివారి దర్శనానికి వీరికి ఇబ్బంది కలగకుండా ఆలయం వద్ద జిల్ ఫౌండేషన్, శ్రీకాకుళం జన సేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు అధ్వర్యంలో పులిహోర, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు .
ఈ సందర్భంగా సర్వేశ్వర రావు మాట్లాడుతూ ఆదిత్యుని దర్శించేందుకు వచ్చిన భక్తులు సేదదీరేందుకు వీటిని పంపిణీ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో(జిల్ ఫౌండేషన్) సత్యసాయి , సాయి , యశ్వంత్ , నవీన్ , మధు , సంతు , రోహిత్ , శరత్ చంద్ర , శేఖర్ , హర్షిత , కార్తీక్ , మనోజ్ , రఫీ , సిద్దూ తదితరులు పాల్గొన్నారు .