37.2 C
Hyderabad
April 26, 2024 22: 04 PM
Slider కృష్ణ

ఛారిటీ: లాక్ డౌన్ ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం

#RajendraPrasad

లాక్ డౌన్ లో వున్న పేద మధ్య తరగతి కుటుంబాల్ని ఆదుకోవటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 1 వార్డు లో రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  గుంజా లక్ష్మణ్ రావు పర్యవేక్షణలో 600 కుటుంబాలకు ఇంటింటికి కోడిగుడ్లు, ఉల్లిపాయలు  పంపిణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేమని వీళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వీళ్లకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అందరూ లాక్ డౌన్ కచ్చితంగా పాటించి కరోనా వైరస్ దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

అలాగే 1వ వార్డులో కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంపిణికి సహకరిస్తున్న గోరెంట్ల నరేంద్ర, మోటూరి నాగేంద్ర, పేరేపి నరేష్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యురు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, కూనపరెడ్డి వాసు, పాండ్రాజు చిరంజీవి, lp రఫీ, A నజీర్, శేఖర్ 1వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

అల్లూరి సీతారామరాజు సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

మట్టపల్లి లక్ష్మీ నృసింహ దేవస్థానానికి భారీ విరాళం

Satyam NEWS

జీవకోటి ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్ సంచులు

Satyam NEWS

Leave a Comment