విజయవాడలో ఆదివారం నాడు సుమారు 30 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అదే విధంగా కృష్ణలంకలో 3, మాచవరంలో 2, రైల్వే ఆస్పత్రిలో 2 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మాచవరం పీఎస్ లో నాలుగు, నున్నలో ఒకటి పాజిటీవ్ కేసు నమోదు కాగా సైబర్ సెల్ మహిళా ఎస్సైకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఓ మహిళా ఎస్ ఐ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.