ముస్లిం సోదరులు మసీదుకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ, పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు పాటించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట టూ టౌన్ సి.ఐ P. క్రిష్ణయ్య ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలోని అన్ని మసీదులు, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ముస్లిం మత పెద్దలు, ఎస్. ఐ పఠాన్. రబ్బానీ ఖాన్ ప్రచారం చేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో రోజు చేసే ఐదు పూటల నమాజులు ,సహరి, ఇప్తార్ కూడా ఇంట్లోనే పాటించాలి అని వారు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వ్యాధి నిర్మూలన కోసం ముస్లిం సోదర, సోదరీమణులందరిని దువా చేయవలసిందిగా వారు కోరారు.
ఈ విషయాన్ని ముస్లిం మత పెద్దలు పోలీసులు వీధి వీధి తిరుగుతూ అందరికి అవగాహన కల్పించారు. ప్రభుత్వానికి, పోలీసువారికి సహకరించి కరోనా నిర్మూలనకు దోహదపడవలసిందిగా వారు కోరారు.