గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని కుంకలగుంట కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియా పెట్రేగి పోతున్నది. ఈ రోజు తెల్లవారు జామున కుంకలగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం గుట్టుగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు.
సుమారు 78 బస్తాలతో వెళుతున్న వాహనాన్ని స్థానికులు అడ్డుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు నెకరికల్లు ఎస్ ఐ పి ఉదయబాబు తెలిపారు.