నిర్మల్ జిల్లా తాంసి మండలం బండల్ నాగపూర్ లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను సోమవారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరిశీలించారు.
అనంతరం రాథోడ్ బాపురావు మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణం చాలా నాణ్యత తో నిర్మిస్తున్నారని తెలిపారు. జిల్లా లోనే బండల్ నాగపూర్ లోనే తొలి రైతు వేదిక నిర్మించేలా ఉందని తెలిపారు.
ఇలాగే బోథ్ మండల అభివృద్ది లో కూడా ముందుకు పోవడం సంతోషించే విషయం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో తాంసీ మండల జెడ్ పి టి సి తాటి పెళ్లి రాజు, ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు రాళ్ళబండి శంకర్, ప్రభాకర్ రెడ్డి, స్థానిక టిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.