శ్రీకాకుళం జిల్లా కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో పని చేస్తున్న 20 మంది అధ్యాపకులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 20 మందిని అప్పటి సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీనివాస రావు అర్ధంతరంగా తొలగించారు. 2019 – 2020 విద్యా సంవత్సరంలో వీరు కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో వారు పని చేశారు.
ఈ విద్యా సంవత్సరం లో వారిని అర్ధాంతరంగా వీరిని విధుల నుంచి తొలగించారు. తమను అర్ధంతరంగా తొలగించడంపై అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. మానవతా దృక్పథంతో ఈ ఏడాది వీరందరినీ పునర్ నియామకం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమకు మళ్లీ అవకాశం కల్పించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె . నివాస్ కు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి బి. చంద్రకళ కు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పైడి. వెంకటరమణకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.