40.2 C
Hyderabad
April 29, 2024 16: 16 PM
Slider శ్రీకాకుళం

తొలగించిన కే.జీ.బీ.వీ అధ్యాపకులకు మరల ఉద్యోగాలు

#SrikakulamDist

శ్రీకాకుళం జిల్లా కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో పని చేస్తున్న 20 మంది అధ్యాపకులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 20 మందిని అప్పటి సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీనివాస రావు అర్ధంతరంగా తొలగించారు. 2019 – 2020 విద్యా  సంవత్సరంలో వీరు కేజీబీవీ  ఇంటర్మీడియట్ కళాశాలలో వారు పని చేశారు.

ఈ విద్యా సంవత్సరం లో వారిని అర్ధాంతరంగా వీరిని విధుల నుంచి తొలగించారు. తమను అర్ధంతరంగా తొలగించడంపై అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. మానవతా దృక్పథంతో ఈ ఏడాది వీరందరినీ  పునర్ నియామకం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్  జె.నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

తమకు మళ్లీ అవకాశం కల్పించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె . నివాస్ కు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి బి. చంద్రకళ కు, సమగ్ర శిక్ష అదనపు  ప్రాజెక్టు  కోఆర్డినేటర్   పైడి. వెంకటరమణకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

*ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభo

Bhavani

మాస్కులు ధరించని వారికి జరిమానా విధించిన అధికారులు

Satyam NEWS

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

Satyam NEWS

Leave a Comment