28.7 C
Hyderabad
April 27, 2024 04: 46 AM
Slider కడప

రాజంపేట ఏరియాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

red sandals

కడప జిల్లా రాజంపేట అటవీశాఖ పరిధిలోని బీడు బాయి బీటులో, తుమ్మల బైలు బీటులో అక్రమంగా తరలిస్తున్న 23 ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అటవీ సిబ్బంది మంగళవారం వారిని మీడియా సమావేశంలో హాజరు పరిచారు.

వేరు వేరుగా అటవీ సిబ్బంది జరిపిన దాడుల్లో ఎర్ర చందనం కూలీలు ఎదురు దాడి చేయగా వారిని సమర్ధవంతంగా ఎదుర్కొని బీడు బాయి బీటులో ఇద్దరిని, తుమ్మల బైలు బీటులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 16 మంది పరారీ అయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 23 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. పరారీ అయిన వారి కోసం గాలింపు చేపట్టారు.

Related posts

16 నుంచి శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

లోన్ యాప్ ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు

Bhavani

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Sub Editor

Leave a Comment