ప్రముఖ సమాజ సేవకురాలు డాక్టర్ కె అనితా రెడ్డి వరంగల్ లోని అనాథాశ్రమంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నేడు పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం అని ఈ సందర్భంగా అనితారెడ్డి అన్నారు.
అక్షరం రాయాలన్నా అన్నం తినాలన్నాఐదువేళ్ళూ కలవాల్సిందే. మనుషులైనా అంతే చిన్న పెద్ద అన్న తేడా వద్దు ఎవరి ప్రాముఖ్యం వాళ్లదేనని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా అక్కడి పేదవారికి ఆమె ఆహారం పంపిణీ చేశారు.