రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రోడ్డుపైన ఒక గుంత లేకుండా చేస్తానన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు డిమాండ్ చేశారు. పారుమంచాల తుడిచేర్ల మధ్యలో గుంతల రహదారిపై ప్రయాణికులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి మూడున్నర సంవత్సరాలైనా ఇంతవరకు ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు కనీసం గతంలో వేసిన రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడిన గుంతలు పూడ్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని అన్నారు.
హామీలకే పరిమితం ఆచరణలో శూన్యం అనే చందాగా ఈ ప్రభుత్వం ఉందని పారుమంచాల నుండి తుడిచెర్ల వరకు రోడ్డు చాలా దారుణంగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు స్థానిక రాజకీయ నాయకులు గానీ అధికారులు గాని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ దారి మీదుగా వేలు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఆటోలు లారీలు బస్సులు తిరుగుతుంటాయని ఈ రోడ్డు గూండా వెళ్లాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతూ నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఈ రోడ్డును నిర్మించాలని లేదంటే పారుమంచాల తుడిచెర్ల గ్రామ ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్వాములు హెచ్చరించారు.