42.2 C
Hyderabad
April 26, 2024 18: 39 PM
Slider క్రీడలు

టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం

#rohitsharma

టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను బిసిసిఐ నియ‌మించింది. ఇప్పటికే వ‌న్డే, టి20 లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ ఇక‌ నుంచి టెస్టు క్రికెట్ కు కూడా కెప్టెన్‌గా వ్య‌వ‌హరించనున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ త‌ప్పుకుంటున్న‌ట్లు ఇటీవల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిన‌దే.

త్వ‌ర‌లో శ్రీ‌లంక‌తో ప్రారంభ‌మ‌య్యే టెస్ట్‌, టి20 సిరీస్‌తో రోహిత్ కెప్టెన్‌ బాధ్యతలను స్వీకరిస్తాడు. శ్రీ‌లంక‌తో జ‌ర‌గ‌బోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం బిసిసిఐ టీమ్ ఇండియ జ‌ట్టును ప్ర‌క‌టించింది. జట్టులో రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), మ‌యాంక్ అగ‌ర్వాల్‌, ప్రియంక్ పంచాల్‌, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్య‌ర్్‌, హ‌నుమ విహ‌రి, శుభ‌మ‌న్ గిల్‌, రిష‌భ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), కేఎస్ భ‌ర‌త్, అశ్విన్ (ఫిట్‌నెస్‌గా ఉంటే), ర‌వీంద్ర జ‌డేజా, జయంత్ యాద‌వ్‌, కుల్దీప్ యాద‌వ్‌, బుమ్రా (వైస్ కెప్టెన్‌), ష‌మి, సిరాజ్‌, ఉమేవ్ యాద‌వ్, సౌర‌భ్ కుమార్ ఉంటారు.

అదే విధంగా టి20 జ‌ట్టు లో రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్‌), బుమ్రా (వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్య‌ర్, సుర్య‌కుమార్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ చాహ‌ర్‌, దీప‌క్ హుడా, ర‌వీంద్ర జ‌డేజా, యుజేంద‌ర చాహ‌ల్‌, ర‌వి బిష్ణోయ్‌, కుల్దీప్ యాద‌వ్ సిరాజ్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అవేశ్‌ఖాన్ ఉంటారు.

Related posts

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు కరోనా కేసులు

Satyam NEWS

మెట్రో స్టేషన్ లో ఊహించని ప్రమాదం

Satyam NEWS

Leave a Comment