నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని వాసవీ కల్యాణ మండపం లో నేడు RSS ఖండ కార్యకర్తల విస్తృత స్థాయి యోజన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విభాగ్ సహ కార్యవహ పత్తికొండ రాము మాట్లాడుతూ ప్రపంచం లోని హిందువులందరి స్వప్నం రామ మందిర నిర్మాణం అన్నారు.
ప్రపంచ మానవాళికి శ్రీరాముడి జీవితం ఆదర్శ మార్గం, రామాయణ మహాభారతాలు ఆచరణీయ గ్రంధాలు అన్నారు.
ఈ రోజు సమాజం లో పెచ్చుమీరుతున్న రుగ్మతలు, తారతమ్యాలు రూపుమాపాలంటే శ్రీరాముని జీవనం విధాన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కొల్లాపూర్,పెంట్లవెల్లి మండలాలలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశం లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లో జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమం లో అందరూ భాగస్వామ్యం వహించాలని అన్నారు.
ధర్మ విఘాతం కలిగినప్పుడు ప్రతీ హిందువు సంఘటిత శక్తి చూపుతూ ధర్మ పరిరక్షణ కోసం కంకణ బద్దులు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయోజక్ కట్ట ప్రభాకర్, కొల్లాపూర్ ఖండ సంయోజక్ తమటం శేఖర్ గౌడ్, జిల్లా నిధి ప్రముఖ్ ఆగపు నాగయ్య, కొల్లాపూర్ ఖండ సహ సంయోజక్ బృంగి కృష్ణప్రసాద్,
నిధిప్రముఖ్ గౌరం ధనుంజయ, జిల్లా సభ్యులు ఎల్లేని సుధాకర్ రావు, కట్టా నరేందర్ రెడ్డి 23 గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్