తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎస్.జైపాల్ రెడ్డి అని మాజీ ఎంపి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. జైపాల్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన నేడు ఘనంగా నివాళులు అర్పించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని కడ్తల్, అమన్ గల్ మండలాలో జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లో ప్రధాన పాత్ర పోషించిన, తెలంగాణ మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి అని అన్నారు. ఆయనను తెలంగాణ ప్రజలు నిత్యం స్మరించుకోవాలని మల్లురవి అన్నారు.