26.7 C
Hyderabad
April 27, 2024 07: 05 AM
Slider ప్రత్యేకం

హీరో సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

#accident

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు.

నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను (ట్రంప్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు. హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టే చాలా పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో 120 స్పీడ్లో ఆయన వెళ్ళినట్లు గుర్తించారు.

Related posts

2 డోసుల టీకా లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రవేశం లేదు

Sub Editor

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ.2 వేల కోట్లు విడుదల

Satyam NEWS

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

Leave a Comment